byసూర్య | Sat, Apr 20, 2024, 12:00 PM
బీజేపీ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఈ నెల 22న నామినేషన్ దాఖలు వేయనున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. 22న అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా నిర్వహించే ర్యాలీలో అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేయాలని కోరారు.