byసూర్య | Sat, Apr 20, 2024, 11:59 AM
వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. శుక్రవారం పోలీసుల వివరాలిలా. చర్లపల్లికి చెందిన దంపతులు ద్విచక్ర వాహనంపై భువనగిరిలోని స్వర్ణగిరికి వెళ్లి తిరిగి వెళ్తుండగా బీబీనగర్ సమీపాన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.