byసూర్య | Sat, Apr 20, 2024, 12:02 PM
నల్గొండ పార్లమెంట్ స్థానంలో ఈసారి కాషాయం జెండా ఎగరడం ఖాయమని నల్లగొండ బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గుర్రంపోడు మండలం కొప్పోలులో పలు పార్టీలకు చెందిన పలువురు ఆయన సమక్షంలో గురువారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీతోనే అవినీతి రహిత, సుస్థిర పాలన సాధ్యమన్నారు. దేశం ప్రధాని మోదీ నాయకత్వాన్ని కోరుకుంటుందని తెలిపారు.