byసూర్య | Sat, Apr 20, 2024, 11:52 AM
ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాలలో 739 ర్యాంకు సాధించిన కరీంనగర్ కు చెందిన సహనను కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ అభినందించారు. శనివారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో వారి నివాసానికి వెళ్లి సివిల్స్ ర్యాంకర్ సహనాను శాలువ, పుష్పగుచ్చంతో సన్మానించి స్టడీ సర్కిల్ ను సందర్శించి పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థుల్లో స్ఫూర్తి నింపాలని ఆమెను కోరారు.