byసూర్య | Sat, Apr 20, 2024, 11:51 AM
ఆందోల్ మండలం సంగుపేట వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. నాందేడ్- అకోలా హైవే- 161పై జరిగిన ప్రమాదంలో పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మల్లంపేట రాములు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన క్షత్రగాత్రుడిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.