హైదరాబాద్‌ నుంచి తెలంగాణ టూరిజం ప్యాకేజీ

byసూర్య | Fri, Apr 19, 2024, 11:58 AM

 వేసవికాలం నేపథ్యంలో తెలంగాణ టూరిజంశాఖ ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నది.ఇందులో భాగంగా పౌర్ణమిని పురస్కరించుకుని ఏప్రిల్‌ 21, మే 20, జూన్‌ 19న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలం యాత్రకు స్పెషల్‌ టూర్‌ను సిద్ధం చేసింది. మార్గమధ్యలో వివిధ ఆలయాలను కూడా చూపించి పర్యాటకులను ఆకట్టుకునేందుకు ముందుకుసాగుతోంది. నాలుగు రోజులపాటు నిర్వహించే ఈ యాత్రలో కాణిపాకం, తిరువానమలై, వేలూరు అమ్మవారి దర్శనం ఉంటుంది.ఏసీ బస్సుల్లో ప్రయాణం ఉండే ఈ ప్యాకేజీలో పెద్దలకు రూ.7,500, పిల్లలకు రూ.6,000 టికెట్‌ ధర ఉందని అధికారులు తెలిపారు. అలాగే, మండేఎండల్లో నచ్చిన ప్రదేశాలకు కుటుంబ సమేతంగా, బంధువులు, స్నేహితులతో కలిసి వెళ్లి సరదాగా తిలకించేందుకు ఆసక్తి కలిగిన వారి కోసం ఏసీ లగ్జరీ కారవాన్‌ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్‌ నంబర్‌ 98485-40371లో సంప్రదించాలని వారు సూచించారు.


 


 


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM