byసూర్య | Thu, Apr 18, 2024, 11:10 PM
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పదేళ్లు పాలించిన బీఆర్ఎస్పై కొన్నిసార్లు ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ కూడా రాష్ట్రానికి చేసిందేమీ లేదు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధిస్తుంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుంది' అని అన్నారు.