byసూర్య | Thu, Apr 18, 2024, 10:25 PM
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా అధిక సంఖ్యలో భక్తులతో శోభాయాత్ర నిర్వహించినందుకు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రధాన ర్యాలీ వస్తున్న సమయంలో గౌలిగౌడ వద్ద నిలిపి బాణసంచా కాల్చారని, ర్యాలీ ఆపి ప్రసంగిస్తూ భక్తులు, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినట్టు పేర్కొన్నారు. రాజాసింగ్ తో పాటు జోగేందర్ సింగ్ బిట్టుపై కేసు నమోదు చేశారు.