50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి

byసూర్య | Thu, Apr 18, 2024, 08:59 PM

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రచార జోరు పెంచుతున్నాయి ప్రధాన పార్టీలు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా.. రేపు తెలుగు రాష్ట్రాల్లోనూ నోటిఫికేషన్ విడుదలవుతోంది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నేతలంతా.. బహిరంగసభలు, రోడ్ షోలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ పార్టీ కూడా గేరు మార్చనుంది. కాగా.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించేందుకు ఇప్పుడు.. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కూడా అదే పాత్ర పోషించనున్నారు. అయితే.. ఈసారి మాత్రం కేవలం తెలంగాణలోనే కాదు దేశ వ్యాప్తంగా తన ప్రసంగాలు వినిపిస్తూ.. నేషనల్ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించనున్నారు. ఎన్నికల ప్రచారానికి రావాలని ఇప్పటికే 7 రాష్ట్రాల పీసీసీల నుంచి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఇందులో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళతో పాటు తమిళనాడు, బీహార్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో.. ఆయా రాష్ట్రాల్లో ప్రచారం చేసేందుకు రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. ఈమేరకు రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ కూడా ఖరారైంది.


కేరళలో రెండు రోజుల పాటు రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. అందులోనూ.. రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్‌తో పాటు కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న అలప్పుజ నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు ఏప్రిల్ 19 నుంచి వచ్చే నెల 11 వరకు తెలంగాణలో సీఎం రేవంత్ సుడిగాలి పర్యటన చేయనున్నారు రేవంత్. దీంతో.. మొత్తంగా రేవంత్ రెడ్డి 50 బహిరంగ సభలతో పాటు 15 రోడ్ షోలలో పాల్గొనున్నారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM