byసూర్య | Thu, Apr 18, 2024, 08:55 PM
సౌత్ సెంట్రల్ రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారిగా రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాలలో కలిపి రూ.20,339.36 కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. జోన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇదే అత్యధిక మొత్తమని వెల్లడించారు. 2022-23లో రాబడి రూ.18,976 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 7 శాతం అధికమన్నారు.
2023-24లో ప్రయాణికుల ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వేకు రూ.5,731.8 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 26.2 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థనాలకు చేర్చారు. 2022-23లో ప్రయాణికుల సంఖ్య 25.55 కోట్లు కాగా.. ఈ ఏడాది స్పెషల్ ట్రైన్లు నడిపించడం, డిమాండ్కు అనుగుణంగా అదనపు కోచ్లను జోడించడంతో ప్రయాణికులతో పాటు ఆదాయం కూడా పెరిగిందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. సరకు రవాణాలో గతేడాది కంటే 4.4శాతం అధికంగా రూ.13,620 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.