సౌత్ సెంట్రల్ రైల్వేకు రికార్డు ఆదాయం.. జోన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికం

byసూర్య | Thu, Apr 18, 2024, 08:55 PM

సౌత్ సెంట్రల్ రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారిగా రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాలలో కలిపి రూ.20,339.36 కోట్ల ఆదాయాన్ని సొంతం చేసుకున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. జోన్‌ ప్రారంభం అయినప్పటి నుంచి ఇదే అత్యధిక మొత్తమని వెల్లడించారు. 2022-23లో రాబడి రూ.18,976 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం 7 శాతం అధికమన్నారు.


2023-24లో ప్రయాణికుల ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వేకు రూ.5,731.8 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. 26.2 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థనాలకు చేర్చారు. 2022-23లో ప్రయాణికుల సంఖ్య 25.55 కోట్లు కాగా.. ఈ ఏడాది స్పెషల్ ట్రైన్లు నడిపించడం, డిమాండ్‌కు అనుగుణంగా అదనపు కోచ్‌లను జోడించడంతో ప్రయాణికులతో పాటు ఆదాయం కూడా పెరిగిందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. సరకు రవాణాలో గతేడాది కంటే 4.4శాతం అధికంగా రూ.13,620 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM