byసూర్య | Thu, Apr 18, 2024, 01:00 PM
పరీక్ష సరిగ్గా రాయలేదన్న సాకుతో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని చితక బాదిన ఘటన చింతపల్లి మండల కేంద్రంలోని మాతృశ్రీ స్కూల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 5వ తరగతి చదువుతున్న తుంగపాడుకు చెందిన త్రిశూల్ తెలుగు పరీక్ష సరిగ్గా రాయలేదని ఉపాధ్యాయుడు కర్రతో కొట్టడంతో బాలుడి వంటిపై వాతలు పడ్డాయి. ఈ ఘటనపై బుధవారం ప్రిన్సిపాల్ స్పందిస్తూ ఉపాధ్యాయుడిని విధుల నుండి తొలగించామని తెలిపారు.