byసూర్య | Thu, Apr 11, 2024, 02:45 PM
బీబీనగర్ మండలం గొల్లగూడెంలోని ఉపాధి హామీ కూలీలకు గురువారం ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాలలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు తిరిగినట్లైతే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. చట్టాన్ని ఎవ్వరూ కూడా చేతిలోకి తీసుకోకుండా పోలీసులకు తెలపాలన్నారు. కాంగ్రెస్ నాయకులు మహేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.