byసూర్య | Tue, Apr 09, 2024, 11:16 AM
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడ వాల్మీకినగర్ లో గల శ్రీ రామాలయంలో నిర్వహించే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలను మంగళవారం ఆవిష్కరించారు. కౌన్సిలర్ రాజేందర్ మాట్లాడుతూ. ఈ నెల 17న కళ్యాణ మహోత్సవం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. నిర్మల్ పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సీతారాముని కళ్యాణాన్ని చూసి తరించాలని కోరారు. అనంతరం అన్నదానం ఉంటుందని పేర్కొన్నారు.