byసూర్య | Tue, Apr 09, 2024, 11:18 AM
బిజెపి ఐటి, సోషల్ మీడియా కన్వీనర్లను నియమిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కందిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉత్తర్వులను అందజేశారు. ఐటీసీ జిల్లా కన్వీనర్ గాజుల మల్లికార్జున్, సభ్యులుగా రాజు, సంగారెడ్డి కన్వీనర్ గా విష్ణువర్ధన్ లను నియమించినట్లు చెప్పారు. జిల్లా పరిధిలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో బిజెపి విజయానికి కృషి చేయాలని సూచించారు.