byసూర్య | Fri, Feb 23, 2024, 12:30 PM
పొలం దగ్గర విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన కోస్గిలో చోటు చేసుకుంది. మండలంలోని బిజ్జరం కు చెందిన శివకుమార్ (22) గురువారం ఉదయం పొలంలో బోరు మోటారు ఆన్ చేస్తుండగా స్టాటర్కు విద్యుత్ తీగ తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మహబూబ్ నగర్ ఎంవీఎస్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతూ. తల్లిదండ్రులకు తోడుగా ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోస్గి ఎస్ఐ శేఖర్ గౌడ్ తెలిపారు.