byసూర్య | Sun, Dec 10, 2023, 09:21 AM
హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబాఫులే ప్రజాభవన్లో రెండో రోజు నిర్వహించిన దర్బార్లో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా రెండో రోజు అధికారులు అర్జీల స్వీకరణ చేపట్టారు. ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగింది. దాదాపు 800 మంది వినతిపత్రాలు అందజేశారు.