byసూర్య | Sat, Dec 09, 2023, 09:00 PM
లోక్ సభ ఎన్నికల్లో విజయంపై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అన్ని స్థానాలను గెలుచుకుంటుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు, ఓటింగ్ శాతం భారీగా పెరిగాయని గుర్తు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించిందని ఆనందం వ్యక్తం చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచామన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా 400 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాము తెలంగాణలోని అన్ని స్థానాలను గెలవడంతో పాటు తెలంగాణలో రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జోస్యం చెప్పారు.