'తెలంగాణ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయటం ఖాయం'

byసూర్య | Sat, Dec 09, 2023, 07:04 PM

తెలంగాణలో మరికొన్ని నెలల్లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయటం ఖామమని మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, తప్పుడు ప్రచారాలు చేసినా బీజేపీని తెలంగాణ ప్రజలు 8 స్థానాల్లో గెలిచారని తెలిపారు. బీజేపీకీ ఓట్లు, సీట్లు పెంచేందుకు కృషి చేసిన ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకు ఈటల ధన్యవాదాలు చెప్పారు. బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. అందుకు నిదర్శనమే ఈసారి సీట్లతో పాటు ఓటింగ్ శాతం కూడా పెరగటం అని పేర్కొన్నారు. అయితే.. గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 4 నాలుగు స్థానాల్లోనే గెలిచిన బీజేపీ.. ఈసారి వచ్చే ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని నిరూపించారన్నారు ఈటల.


పీఎం నరేంద్ర మోదీ.. గత తొమ్మిదేళ్ల పాటు భద్రత, భరోసానే కాదు ప్రపంచవ్యాప్తంగా భారత దేశ గొప్పతనాన్ని చాటారని ఈటల రాజేందర్ కొనియాడారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌లలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఈటల గుర్తు చేశారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 స్థానాలు గెలవడమే లక్ష్యంగా మోదీ పని చేస్తున్నారని వివరించారు. అయోధ్యలో అందరినీ ఒప్పించి రామాలయం కట్టిస్తున్న వ్యక్తి మోదీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీకే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారన్నారు. కాగా.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తున్నవే అని ఈటల చెప్పుకొచ్చారు. పేదలకు సొంతింటి కళ నెరవేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఈటల రాజేందర్ వెల్లడించారు.



Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM