byసూర్య | Sat, Dec 09, 2023, 12:07 PM
బడంగ్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్లోని ఎస్బీఆర్ కాలనీలో శనివారం బడంగ్ పేట్ మేయర్ చిగురింత పారిజాత సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిన్నటిదాక ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా అభివృద్ధి పనులు నిలిచిపోయినట్లు తెలిపారు. కోడ్ ముగియడంతో బడంగ్ పేట్ కార్పొరేషన్ లోని అన్ని డివిజన్లలో మంజూరైన పనులు వేగవంతంగా జరుగుతాయన్నారు.