byసూర్య | Sat, Dec 09, 2023, 12:02 PM
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 3, 124 మంది విద్యార్థులు ఈనెల 10న నిర్వహించే ఎన్ఏంఏంఎస్ పరీక్ష రాయనున్నారు. మొత్తం 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. దీని కోసం గత మూడు నెలల నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఉపకార వేతనంగా ప్రతి ఏడాది రూ: 12 వేలు ప్రభుత్వం అందించనుంది.