విద్యుత్ శాఖపై సీఎం సమీక్షకు ట్రాన్స్‌కో సీఎండీ డుమ్మా

byసూర్య | Fri, Dec 08, 2023, 07:12 PM

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై గురువారం సచివాలయంలో సమీక్ష జరిపారు. అయితే ఈ సమీక్షా సమావేశానికి ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు గైర్హాజరు కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమీక్షా సమావేశంలోనే విద్యుత్ శాఖ పరిస్థితిపై అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో విద్యుత్ శాఖ పరిస్థితి, అప్పులు, తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.


మరోవైపు గురువారం నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగానే


తెలంగాణ విద్యుత్ శాఖకు 85 వేలకోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించవద్దన్న సీఎం.. విద్యుత్ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో శుక్రవారం సమావేశానికి రావాలని ఆదేశించారు. అయితే శుక్రవారం సచివాలయం వేదికగా సమీక్షా సమావేశం జరగ్గా.. ఈ భేటీకి ట్రాన్స్‌కో సీఎండీ గైర్హాజరయ్యారు. సీఎం ఆదేశించినప్పటికీ ట్రాన్స్‌కో సీఎండీ గైర్హాజరు కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.


అయితే ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు ఈ సమావేశానికి హాజరుకానప్పటికీ.. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. విద్యుత్ శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, సింగరేణి సీఎండీ శ్రీధర్, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొని విద్యుత్ రంగానికి సంబంధించిన కీలకమైన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.మరోవైపు అనారోగ్యం కారణంగా సీఎండీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానంటూ ప్రభాకర్ రావు ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే ప్రభుత్వం రాజీనామాను ఇంకా ఆమోదించలేదు. విద్యుత్ శాఖకు సంబంధించి అన్ని అంశాలపై ప్రభాకర్ రావు నుంచి వివరణ తీసుకోవాలనే ఉద్దేశంతోనే రాజీనామాను ఆమోదించినట్లు తెలిసింది.


నన్ను పిలవలేదు..


మరోవైపు సమీక్షా సమావేశానికి రావాల్సిందిగా తనను ఎవరూ పిలవలేదని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. సీఎంవో నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని ప్రభాకర్ రావు చెప్పారు. పిలిస్తే తప్పకుండా వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు. దీనిపై అధికారుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM