byసూర్య | Wed, Dec 06, 2023, 07:15 PM
తెలంగాణ కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను కలిశారు. రేపు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించటంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ను సోనియా, రాహుల్ అభినందించారు.