byసూర్య | Tue, Dec 05, 2023, 04:08 PM
హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రన్వేను గంటకు 42 విమానాల నుంచి 50కి పైగా విమానాలు రాకపోకలు సాగించేలా విస్తరిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ తెలిపారు. రాజ్యసభలో BJP సభ్యుడు కె. లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ప్రస్తుతం ఇక్కడ ఒక రన్వే మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం ఎయిర్ పోర్టు ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవే, అడిషనల్ ప్యారలల్ ట్యాక్సీవే, యాప్రాన్ నిర్మించారని అన్నారు.