byసూర్య | Tue, Dec 05, 2023, 12:19 PM
హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి విజయవాడ, విశాఖ, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లను స్టేషన్లకే పరిమితం చేశారు. అత్యవసరమైతే తప్ప తుఫాను ప్రభావిత ప్రాంతాల దిశగా ప్రయాణాలు వద్దని సూచించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలోని బుకింగ్ కేంద్రాల్లో టికెట్లు రద్దు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
వారికి ఛార్జీలను తిరిగి చెల్లించనున్నారు.హైదరాబాద్ నుంచి కొల్లాం వెళ్లే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. దీంతో హైదరాబాద్ నుంచి శబరిమలకు రైళ్లు తక్కువగా నడవనున్నాయి. పలు రైళ్లు రద్దు చేయడంతో వారికి వేరే రైళ్లలో టికెట్లు దొరికే పరిస్థితి కూడా లేదని అధికారులు చెబుతున్నారు.