పోలీసులతో వాగ్వాదానికి దిగారంటూ,,,,బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు

byసూర్య | Mon, Dec 04, 2023, 10:41 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను ఓడించిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో ఐపీసీ సెక్షన్ 290, 353, 506 కింద కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డి ఓట్ల లెక్కింపు వేళ పోలీసులతో వాగ్వాదానికి దిగి ఉద్రిక్త వాతావరణం సృష్టించారని, ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని పోలీసులు అంటున్నారు. కాగా, పోలింగ్ కు ముందు తనను గెలిపించకపోతే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యం అని పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించడం సంచలనం సృష్టించింది.


 


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM