byసూర్య | Sun, Dec 03, 2023, 02:28 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ అధికారంలోకి రావాలంటే 119 సీట్లలో 60 సీట్లు కావాలి. కాంగ్రెస్ ఇప్పటికే 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కు దాదాపు 70 నుంచి 80 సీట్లు వస్తాయని అంచనాలు నిజమవుతున్నాయి.
గజ్వేల్ లో కేసీఆర్ ఆధిక్యం కనబర్చారు. 14,400 ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ దూసుకుపోయారు. కొడంగల్లో టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్రెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై దాదాపు 33 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో రేవంత్ రెడ్డి దాదాపు 9 వేల ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 60,227 ఓట్లతో బీఆర్ఎస్ పద్మారావు.టీ లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ 24,187 సంతోష్ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు.