byసూర్య | Sun, Dec 03, 2023, 02:43 PM
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచి, బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలకు ప్రజలు ఝలక్ ఇచ్చారు. తాజా ఎన్నికల్లో పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఈ జాబితాలో పినపాక-రేగ కాంతారావు, నకిరేకల్-చిరుమర్తి లింగయ్య, కొత్తగూడెం-వనమా వెంకటేశ్వరరావు, భూపాలపల్లి-గండ్ర వెంకటరమణ, పాలేరు-ఉపేందర్ రెడ్డి, కొల్లాపూర్-హర్షవర్దన్, వైరా-హరిప్రియ, అశ్వారావు పేట-మెచ్చా నాగేశ్వరరావు, తాండూరు-పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు.