byసూర్య | Sun, Dec 03, 2023, 12:48 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ అధికారంలోకి రావాలంటే 119 సీట్లలో 60 సీట్లు కావాలి. కాంగ్రెస్ ఇప్పటికే 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కు దాదాపు 70 నుంచి 80 సీట్లు వస్తాయని అంచనాలు నిజమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాసేపట్లో గాంధీభవన్ చేరుకోనున్నారు. కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికే విజయోత్సవ సంబరాలు ప్రారంభించాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు గాంధీభవన్కు చేరుకోనున్న రేవంత్రెడ్డి ఫలితాలను సమీక్షించి కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు.