byసూర్య | Sun, Dec 03, 2023, 12:40 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. ఇక్కడ అధికారంలోకి రావాలంటే 119 సీట్లలో 60 సీట్లు కావాలి. కాంగ్రెస్ ఇప్పటికే 66 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కు దాదాపు 70 నుంచి 80 సీట్లు వస్తాయని అంచనాలు నిజమవుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఖాతాలో మరో సీటు చేరింది. రామగుండంలో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. ఆ పార్టీ అభ్యర్థి మక్కన్ సింగ్ ఠాకూర్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కురుకంటి చందర్పై భారీ విజయం సాధించారు. మక్కన్సింగ్ విజయంతో కాంగ్రెస్కు మూడు సీట్లు చేరాయి. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం విజయం సాధించింది. చార్మినార్ నుంచి ఎంఐఎం అభ్యర్థి జుల్ఫికర్ అలీ విజయం సాధించారు. అలీ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మేఘరాణి అగర్వాల్పై విజయం సాధించారు.