![]() |
![]() |
byసూర్య | Sun, Dec 03, 2023, 09:49 AM
తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించగా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తెలంగాణలో కౌంటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ లీడింగ్ లో ఉంది. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ లీడ్ సాధించింది. ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.
నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లీడింగ్లో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి ఆయన 5,407 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కొడంగల్ లో మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రేస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి 4389 ఓట్ల అధిక్యం కనబర్చారు. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ వెనుకంజలో ఉన్నారు. రెండో రౌండ్ నాటికి ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ఆధిక్యంలోకి వచ్చారు.