byసూర్య | Sun, Dec 03, 2023, 09:35 AM
తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించగా కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తెలంగాణలో కౌంటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ లీడింగ్ లో ఉంది. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ లీడ్ సాధించింది. ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.
నర్సంపేటలో బీఆర్ఎస్ ఆధిక్యం, సనత్ నగర్ లో తలసాని, జుక్కల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజ, గజ్వేల్ లో తొలి రౌండ్ లో కేసీఆర్ కు 300 ఓట్ల ఆధిక్యం, సిరిసిల్లలో కేటీఆర్ లీడ్ లో ఉన్నారు. ముషీరాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటలో 6,305 ఓట్ల లీడ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు ఉన్నారు.