byసూర్య | Fri, Dec 01, 2023, 04:56 PM
ఖమ్మం జిల్లాలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే ఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్లోకి అనుమతించడం జరిగింది. ఇతరులకు ఎవరికి స్ట్రాంగ్ రూమ్లోకి అనుమతి లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.