byసూర్య | Fri, Dec 01, 2023, 04:49 PM
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు నంబూద్రి దినేష్ కుమార్ ఆధ్వర్యంలో స్వామివారికి కేరళ సాంప్రదాయంలో ధూప దీప నైవేద్యాలతో, ప్రత్యేక మంగళ హారతులాలతో పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.