byసూర్య | Fri, Dec 01, 2023, 04:47 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెంలో జరిగింది. పిండిప్రోలుకు చెందిన రవీందర్ బుధవారం రాత్రి బైక్ పై తిరుమలాయపాలెం వెళ్తున్నాడు. రోడ్డుపక్కనే లారీ నిలిపి ఉండగా ఢీకొట్టాడు.
ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 7న పెళ్లి అని.. దుస్తులు కొనుగోలు చేసేందుకు వెళుతుండగా ప్రమాదం జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు. గురువారం కేసు నమోదైంది.