వందలాది బిడ్డల త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడింది.... రేవంత్ రెడ్డి

byసూర్య | Tue, Nov 28, 2023, 09:54 PM

తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. అరవై సంవత్సరాల పోరాటం.. వందలాది తెలంగాణ బిడ్డల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ను పదేళ్లు ముఖ్యమంత్రిగా చేస్తే ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇంత విధ్వంసం తర్వాత కూడా తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాబట్టి తెలంగాణ ప్రజలు నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని కోరారు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ వచ్చిందో ఆ ఇందిరమ్మ రాజ్యం రావడానికి అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలన్నారు. సోనియమ్మ ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందన్నారు. 'మీ రేవంతన్న సందేశం.. పదేండ్ల విధ్వంసాన్ని పాతరేద్దాం.. ప్రజా ఆకాంక్షల పాలన మొదలెడదాం.. చేయి చేయి కలుపుదాం… అగ్ర శిఖరాన తెలంగాణను నిలుపుదాం..' అని ట్వీట్ చేశారు.



Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM