byసూర్య | Wed, Nov 22, 2023, 02:27 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండి మైసమ్మ పరిధిలోని గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ కంపెనీని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి బుధవారం సందర్శించి ఉద్యోగుల సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగులు తమ మద్దతు తెలియజేసి అత్యధిక మెజారిటీతో హన్మంత్ రెడ్డిని గెలిపిస్తామని తీర్మానం చేసారు.