byసూర్య | Wed, Nov 22, 2023, 03:26 PM
తెలంగాణ కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతుండగా.. రీసెంట్ గానే లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి కూడా చేరారు. తాజాగా బుధవారం మరో ప్రముఖ నటి దివ్యవాణి కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జి మాణిక్ రావు ఠాక్రే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.గతంలో టీడీపీలో సుదీర్ఘ కాలం పని చేసిన దివ్యవాణి 2022 మే 31న తేదీన టీడీపీకి రాజీనామా చేసారు. టీడీపీలో ఉన్న సమయంలో వైసీపీ పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. టీడీపీ మహానాడు వేదిక పైన తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం..నేతల తీరుతో దివ్యవాణి మనస్థాపానికి గురయ్యారు. దీంతో..2022 మే 31న తేదీన టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా దివ్యవాణి సోషల్ మీడియాలో ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో అన్ని విషయాలను చెబుతానన్నారు. అయితే ఈ విషయమై ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు విషయమై చంద్రబాబు అప్పట్లో ఆరా తీశారు. చంద్రబాబుతో చర్చించిన తర్వాత టీడీపీలో కొనసాగుతానని చెప్పుకొచ్చారు.