byసూర్య | Tue, Sep 26, 2023, 11:57 AM
మణికొండకు చెందిన యువతి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోంది. వాట్సాప్ ద్వారా షైలా అనే మహిళ పరిచయం అయింది. తమ సంస్థ వెబ్సైటు ప్రచారం కోసం కొంత మందిని సంప్రదిస్తున్నామని చెప్పి లైక్ లు కొట్టి స్క్రీన్ షాట్ పెడితే మనీ పంపుతాం అనగానే నమ్మిన యువతి అలానే చేసింది. మొదట మనీ పంపి తరువాత మని డిపాజిట్ అడిగితే ఆ యువతి దాదాపు 56 లక్షల వరకు పంపింది. మోసపోయినట్లు గమనించిన యువతి పోలీసులను ఆశ్రయించింది.