byసూర్య | Mon, Sep 25, 2023, 12:27 PM
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా సోమవారం ఖమ్మం రానున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలకనున్నాయి. ఉదయం హైదరాబాద్ నుంచి ఖమ్మం రూరల్ మండలం శ్రీసిటీలో ఉన్న ఆయన నివాసానికి చేరుకోనున్నారు. అనంతరం 9. 30 గంటలకు అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకు చేరుకుంటారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.