byసూర్య | Mon, Sep 25, 2023, 12:16 PM
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ పోలీసులు దర్యాప్తు ముమ్మరమైంది. నిందితుల ఫోన్లకు వచ్చిన కాల్స్ గురించి లోతుగా ఆరా తీస్తున్నారు. దీంతో మత్తు పదార్థాల వాడకందార్లు ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందనే ఆందోళనలో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే సంచలన విషయాలు బయట పడగా.. దర్యాప్తు పూర్తి అయ్యేసరికి మరిన్ని నిజాలు వెలుగులోకి రానున్నాయని పోలీసులు తెలిపారు.