byసూర్య | Mon, Sep 25, 2023, 11:54 AM
గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన విషాదం ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన పల్లవి(16) ఖమ్మంలోని SR కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆదివారం స్పెషల్ క్లాసులకు అటెండ్ అయిన ఆమె అస్వస్థతకు గురై కింద పడిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. పల్లవి కార్డియాక్ అరెస్ట్ వల్ల అప్పటికే మరణించిందని డాక్టర్లు తెలిపారు.