తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్

byసూర్య | Sun, Sep 24, 2023, 10:11 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు కేసీఆర్ సర్కారు శుభవార్త చెప్పింది. యూజీసీ ఏరియర్స్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు డీఎంఈ పరిధిలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల బదిలీకి పచ్చ జెండా ఊపింది. నెల రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కాపీలను ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు వైద్య సంఘాల ప్రతినిధులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. భారీగా బడ్జెట్ కేటాయించి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతోపాటు వైద్య సిబ్బందికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.



Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM