బీ ఫాం పక్కా నాదే.. కడియంతో కలిసిపోలేదు,,,,తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు

byసూర్య | Sun, Sep 24, 2023, 08:43 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. అందులో స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మాత్రం కొంచెం అయోమయంగానే ఉంది. రెండు రోజుల క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగి.. టికెట్ల పంచాయితీకి తెగ్గొట్టారంటూ వార్తలు వచ్చారు. అందుకు తగ్గట్టుగానే.. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య పక్కపక్కనే నిలబడి.. చేతులు కలిపి.. నవ్వుతూ ఫొటోలు దిగారు. దీంతో.. నిజంగానే స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ పంచాయితీ కొలిక్కి వచ్చింది అనుకున్నారంతా. కానీ.. అదంతా తూచ్.. అంటూ తాటికొండ రాజయ్య బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. బీ ఫాం తనదేనంటూ బాంబ్ పేల్చారు. ఒకవేళ సీటు కేటాయించని పక్షంలో పోటీ చేసే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందంటూ యూటర్న్ తీసుకున్నారు రాజయ్య.


లింగాలగణపురం మండలం వడ్డీచర్లలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా.. మీడియాతో మాట్లాడిన రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లే ముందు కలిశానని, అప్పుడు టికెట్‌ నీకే అని చెప్పారని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు కేటీఆర్‌ లేకపోవడంతో మళ్లీ రెండు రోజుల క్రితం సమావేశమైనట్లు తెలిపారు. అయితే.. తనకు ఎమ్మెల్సీగా గానీ.. ఎంపీగా కానీ అవకాశం ఉందని చెప్పినట్లు స్పష్టం చేశారు. అయితే.. అప్పటివరకు స్టేట్ కార్పొరేషన్ నామినేటెడ్ పదవి తీసుకొమ్మన్నట్టు చెప్పుకొచ్చారు.


ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్న ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి కేటీఆర్‌తో ఫోటోలు దిగినట్టు రాజయ్య తెలిపారు. అయితే.. ఆ ఫొటోలు చూసి.. మీడియాలో రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయని.. వాటి వల్ల కార్యకర్తల్లో ఆందోళన నెలకొందన్నారు రాజయ్య. కడియంతో తాన కలిసిపోలేదని రాజయ్య చెప్పుకొచ్చారు. ఆయనతో ఎలాంటి చర్చలు.. సంప్రదింపులు జరగలేదని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బీ ఫాం తప్పకుండా తనకే వస్తుందని రాజయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేల టికెట్ రాకపోతే బరిలో నిలిచేది కాలమే నిర్ణయిస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వే రిపోర్టులు తెచ్చుకొని మార్పులు చేర్పులు ఉంటాయంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను మాత్రమే ప్రకటించారు... ఇంకా బీ ఫాంలు ఇవ్వలేదంటూ ధీమా వ్యక్తం చేశారు తాటికొండ రాజయ్య. ఈ క్రమంలోనే.. మీడియాలో వస్తున్న కథనాలను రాజయ్య ఖండించారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM