byసూర్య | Sun, Sep 24, 2023, 06:18 PM
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మెుదలైంది. అక్టోబర్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ కూడా అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమయ్యాయి. త్వరలోనే ఆ రెండు పార్టీల నుంచి కూడా అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి భగంపడ్డవారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అదిష్టానంపై పట్టుబట్టారు. అయినా అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హస్తం నేతలతో సంప్రదింపులు జరిపారని.. నేడో రేపో ఆయన హస్తం గూటికి చేరటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అయితే మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే మూడు కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ మూడు కండీషన్లకు ఓకే చెబితేనే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని ఆయన మెలిక పెట్టినట్లు సమాచారం. తన సిట్టింగ్ స్థానామైన మల్కాజిగిరితో పాటు మరో అసెంబ్లీ సీట్లు తమ వారికి కేటాయించాలని కోరినట్లు సమాచారం. మల్కాజిగిరి నుంచి తనకు మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తన కుమారుడు రోహిత్కు, మేడ్చల్ నియోజవర్గం నుంచి నక్కా ప్రభాకర్ గౌడ్కు టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ నేతలను మైనంపల్లి కోరినట్లు తెలిసింది.
కాంగ్రెస్ మాత్రం మైనంపల్లికి కుత్బుల్లాపూర్, రోహిత్కి మెదక్ నుంచి సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మేడ్చల్ టికెట్పై కాంగ్రెస్ సైలెంట్గా ఉందని.. ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్ ఆఫర్ను మైనంపల్లి తిరస్కరించినట్లు సమాచారం. తన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి నుంచే పోటీకి దిగుతానని.. కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేయబోనని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో వెల్లడించారు. తాను కుత్బుల్లాపూర్ నుంచి బరిలోకి దిగుతున్నాననేది అబద్ధపు ప్రచారమని కొట్టి పడేశారు. అయితే మైనంపల్లి పెట్టిన మూడు కండీషన్లపై కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఆయన కోరినట్లు మూడు స్థానాలను కేటాయిస్తుందా? లేక ఆయనకు సర్ధిచెప్పి పార్టీలోకి చేర్చుకుంటుందా ? వేచి చూడాలి.