అక్టోబర్ 1,3 తేదీల్లో తెలంగాణ పర్యటనకు మోదీ,,,కొత్త రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన

byసూర్య | Sun, Sep 24, 2023, 06:14 PM

హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందాలంటే రీజినల్ రింగ్ రోడ్డు అత్యంత కీలకమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ట్రిపుల్ఆర్ వస్తే కనెక్టివిటీ పెరిగి ఆ రోడ్డు లోపల పేదలకు తక్కువ ధరకు భూములు దొరుకుతాయని అన్నారు. తద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతుందని చెప్పుకొచ్చారు. కాచిగూడ-యశ్వంతపుర మధ్య వందే భారత్ ట్రైన్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించగా.. కాచిగూడలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు వచ్చాయని ఇది మూడో ట్రైన్ అని తెలిపారు. కాచిగూడ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు మూడు రాష్ట్రాలను, 12 జిల్లాలను కలుపుతూ వెళ్తుందని చెప్పారు.


'తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్టోబర్ 1, 3 వ తేదీల్లో ప్రధాని తెలంగాణకు రాబోతున్నారు. ఆరోజు కూడా అనేక రైల్వే ప్రాజెక్టులకు ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిదిన్నరేండ్లలో ఏటా 55 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం చేపట్టారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ తక్కువగా ఉన్నది. ఆ విషయం గ్రహించే.. ప్రధాని మోదీ అధిక రైల్వే ప్రాజెక్టులు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ ఏడాది రూ.4,418 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించారు.' అని కిషన్ రెడ్డి తెలిపారు.


తెలంగాణలో 31 వేల కోట్ల రూపాయల రైల్వే పనులు నిర్మాణంలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. దాదాపు రూ.2300 కోట్లతో రాష్ట్రంలో అనేక రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయన్నారు. 21 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని ఈ మధ్య వర్చువల్గా ప్రారంభించినట్లు తెలిపారు. 'సికింద్రాబాద్ స్టేషన్కు రూ.717 కోట్ల కేటాయించి ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అలా కాబోతున్నది. నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. కాచిగూడ ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభించబోతున్నాం. చర్లపల్లిలో రూ. 221 కోట్ల న్యూ టెర్మినల్ నిర్మాణం కాబోతుంది. కాజీపేటలో రైల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఫస్ట్ పేజ్లో వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలవుతుంది. తర్వాత రైలుకు సంబంధించిన అన్ని ఉత్పత్తులు అక్కడ తయారవుతాయి.' అని అన్నారు కిషన్ రెడ్డి.


దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనట్లుగా తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల కోసం పూర్తి స్థాయిలో సర్వే చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రజలు రైల్వే సర్వీసులను ఉపయోగించుకోవాలి సూచించారు. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు దానికి అనుసంధానిస్తూ.. రీజినల్ రైలు రావడం హైదరాబాద్కు ఒక గేమ్ ఛేజర్గా మారబోతున్నదని చెప్పారు. ఏ రాష్ట్రానికి లేని విధంగా అత్యధికంగా మనకు వందే భారత్ రైళ్లు వస్తున్నాయి.. అందుకు అంకితభావంతో కృషి చేస్తున్న రైల్వే శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM