నిజామాబాద్ లో ముసుగు దొంగల కలకలం

byసూర్య | Thu, Jun 08, 2023, 01:06 PM

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ముసుగు దొంగలు మళ్లీ రెచ్చిపోతున్నారు. మంగళవారం అర్ధరాత్రి నిజామాబాద్ నగరంలోని నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు బోర్గాం శివారు లో ఉన్న టాటా, హ్యుందాయ్, మారుతి కార్ల షోరూంలలో వెనక వైపు నుంచి చొరబడి టాటా షోరూంలో లాకర్ లో ఉన్న నగదుని లాకర్ పగలగొట్టి దొంగతనం చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. హ్యుందాయ్, మారుతి కార్ల షోరూంలలో దొంగతనంకి ప్రయత్నం చేయగా వారికి ఎటువంటి నగదు గాని వస్తువు గాని దొరక్క పోయేసరికి పారిపోయారని తెలిపారు. షోరూం మేనేజ్మెంట్ వారు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM