byసూర్య | Thu, Jun 08, 2023, 01:06 PM
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ముసుగు దొంగలు మళ్లీ రెచ్చిపోతున్నారు. మంగళవారం అర్ధరాత్రి నిజామాబాద్ నగరంలోని నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు బోర్గాం శివారు లో ఉన్న టాటా, హ్యుందాయ్, మారుతి కార్ల షోరూంలలో వెనక వైపు నుంచి చొరబడి టాటా షోరూంలో లాకర్ లో ఉన్న నగదుని లాకర్ పగలగొట్టి దొంగతనం చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. హ్యుందాయ్, మారుతి కార్ల షోరూంలలో దొంగతనంకి ప్రయత్నం చేయగా వారికి ఎటువంటి నగదు గాని వస్తువు గాని దొరక్క పోయేసరికి పారిపోయారని తెలిపారు. షోరూం మేనేజ్మెంట్ వారు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.