నేడు యాచారంలో ఎమ్మెల్యే పర్యటన
byసూర్య |
Thu, Jun 08, 2023, 10:51 AM
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గురువారం పర్యటిస్తారని ఎంపీడీఓ విజయలక్ష్మి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఊరూరా చెరువుల పండుగ ఉంటుందని ఆమె తెలిపారు. నక్కర్తమేడిపల్లి, తక్కళ్లపల్లి, మల్కీజ్ గూడా , చింతపట్ల, నందివనపర్తి గ్రామాల్లోని చెరువుల వద్ద వేడుకలు నిర్వహిస్తామని, చింతపట్లలోని లక్ష్మణ్ చెరువు వద్ద జరిగే చెరువు పండుగలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొంటారని ఆమె తెలిపారు. ఎంపీపీ కొప్పు సుకన్య, జెడ్పీ టీసీ సభ్యురాలు చిన్నోళ్ల జంగమ్మ పాల్గొంటారని తెలిపారు.
Latest News