byసూర్య | Thu, Dec 01, 2022, 07:51 PM
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గత ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే నియోజకవర్గానికి వచ్చానన్నారు. సహచర మంత్రులు జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో కలిసి గురువారం మునుగోడు మండల కేంద్రం చండూరుకు వచ్చిన కేటీఆర్ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చండూరును త్వరలో రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామన్నారు. మునుగోడులో త్వరలో 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు. చండూరు మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.