byసూర్య | Fri, Sep 23, 2022, 01:09 PM
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో గురువారం ఆసక్తికర ఘటన జరిగింది. నేలకొండపల్లిలో ఇంటర్ చదువుతున్న బానోత్ గోపి ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అందులో వారంతా ఇటీవల జరిగిన సూదిమందు హత్యలపై చర్చించుకున్నారు. అదే సమయంలో ఆటోలో ప్రయాణిస్తున్న వృద్ధుడు సంచిలో చేయి పెట్టాడు. సూది మందు తీస్తున్నాడని గోపి భావించి, ఆటోలోంచి దూకేశాడు. గాయాలు కావడంతో ప్రస్తుతం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.