అంతర్రాష్ట్ర రహదారిపై రోడ్డు ప్రమాదం

byసూర్య | Fri, Sep 23, 2022, 12:49 PM

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తా సమీపంలో అంతరాష్ట్ర రహదారి అయిన అయిజ, కర్నూలు మార్గమధ్యంలో ఉన్న సబ్ స్టేషన్ దగ్గర శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. మానవపాడు మండలం చిన్న పోతులపాడు గ్రామానికి చెందిన మద్దిలేటి, మల్దకల్, రంగన్న ఈ ముగ్గురు పొలానికి బయలుదేరారు. సబ్ స్టేషన్ దగ్గర రోడ్డుపై ద్విచక్ర వాహనం ఆపి ఫోన్లో మాట్లాడుతుండగా. వెనకనుంచి వచ్చి మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్దకల్, మద్దిలేటి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కర్నూలులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి అలంపూర్ చౌరస్తా చెక్ పోస్ట్ పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.


Latest News
 

ఎగ్జిట్ పోల్స్‌పై నాకు నమ్మకం లేదు.. తెలంగాణ ఎన్నికలపై డీకే Sat, Dec 02, 2023, 09:59 PM
ఈ ఎన్నికలు చాలా గుణపాఠాన్ని నేర్పాయి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ Sat, Dec 02, 2023, 09:48 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 22 స్పెషల్ ట్రైన్స్ సర్వీసుల పొడిగింపు Sat, Dec 02, 2023, 09:41 PM
కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తం.. ఆ అభ్యర్థులపై స్పెషల్ ఫోకస్ Sat, Dec 02, 2023, 09:36 PM
తెలంగాణలో సైలెంట్ వేవ్.. మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారే Sat, Dec 02, 2023, 09:29 PM